మధ్యప్రదేశ్లోని ఇండోర్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా వరద ముంచెత్తడంతో నగరం నీట మునిగింది. రోడ్లు పూర్తిగా మునిగిపోగా, ఇళ్లలోకి కూడా వర్షపు నీరు చేరింది. దీంతో జనజీవనం స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం 4 రోజుల్లోనే నగరంలో 10.16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా రోడ్లు మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.