
బీఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్.. రూ.1కే రీఛార్జ్ ప్లాన్!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దీపావళి పండుగ సందర్భంగా 'బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా' పేరుతో సరికొత్త ప్లాన్ను ప్రకటించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్లో భాగంగా, వినియోగదారులు కేవలం రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్లను పొందవచ్చు. సిమ్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఆఫర్ ఒక్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.




