న్యూ ఇయర్ సందర్భంగా పూల ధరలు భారీగా పెరిగాయి. మధురై, అండిపెట్టి మార్కెట్లలో కిలో మల్లెపూలు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు చేరాయి. కనకాంబరాలు కిలో రూ.2,500, చామంతి రూ.120, గులాబీలు రూ.200లకు చేరుకున్నాయి. దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు తెలిపారు.