Top 10 viral news 🔥

త్వరలో అర్హులైనవారికి 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తాం: హోం మంత్రి అనిత
AP: హోం మంత్రి అనిత ఇళ్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో అర్హులైనవారికి 3 సెంట్ల ఇంటి స్థలం కేటాయిస్తామని ఆమె వెల్లడించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి వైసీపీ నేతలు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. త్వరలో ఎస్. రాయవరం–పెనుగొల్లు రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.




