తిరుమలలో భక్తుల పాదరక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్లను మంగళవారం ప్రారంభించారు. స్థానిక తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ల ద్వారా 99 శాతం భక్తులు తమ పాదరక్షలను తిరిగి పొందుతున్నారని, గతంలో 70-80 శాతం మంది వదిలి వెళ్లేవారని తెలిపారు. .