అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. 'సిగ్గు లేకుండా అరుస్తున్నారు' అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ధరణిని అడ్డం పెట్టుకుని వందల ఎకరాల భూమిని గుంజుకున్నారని, అనేక రకాల భూ దోపిడీ జరిగిందని ఆరోపించారు. బాలానగర్ భూముల స్కామ్ పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. నిజాయితీ ఉంటే బీఆర్ఎస్ సభ్యులు హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని సవాల్ విసిరారు.