AP: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి తొలి మహిళా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బొమ్మారెడ్డి శారద (68) మంగళవారం హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతిచెందారు. ఆమెను 2011 నవంబరులో టీటీడీ పరకామణి డిప్యూటీ ఈఓగా నియమించారు. ఆమె మృతి పట్ల పలువురు టీటీడీ అధికారులు సంతాపం తెలిపారు.