మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. చాలీస్గావ్ మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ (శరద్ పవార్ గ్రూప్) రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ దేశ్ముఖ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన 2009 నుంచి 2014 వరకు చాలీస్గావ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. అంతకుముందు చాలీస్గావ్ మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. రాజీవ్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు.