బస్సు-కారు ఢీకొని నలుగురు మృతి

43చూసినవారు
బస్సు-కారు ఢీకొని నలుగురు మృతి
పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు, పంజాబ్ రోడ్‌వేస్ బస్సు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు అమృత్‌సర్ వైపు వెళ్తుండగా, బస్సు హోషియార్‌పూర్ నుండి బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘనపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్