ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభానికి ముందు బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. బ్రిటన్ విడుదల చేసిన తాజా మ్యాప్లో పాలస్తీనా ప్రత్యేక దేశంగా చూపించగా, పారిస్ ఐఫిల్ టవర్పై పాలస్తీనా జెండా ఎగురవేశారు. అమెరికా మినహా మిగతా శాశ్వత సభ్యులు మద్దతు తెలుపగా, 150కి పైగా దేశాలు పాలస్తీనాకు అంగీకారం తెలిపే అవకాశముంది.