జోగులాంబ గద్వాల జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ కోరారు. గురువారం గద్వాల కలెక్టరేట్లో పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 90.99 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని తెలిపారు. జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తారని, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదలవుతుందని పేర్కొన్నారు.