జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, తన అనుచరులతో కలిసి బుధవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుడతామని, ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తూ, పోరాడుతూ పరిష్కారం చూపే
రాజకీయాలు తీసుకువస్తామని తెలిపారు.