తెలంగాణ ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూషణం, తమ ప్రాణాలను పణంగా పెట్టి, ఆకలిదప్పులతో పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, కానీ ఆ ఫలితం తమకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నేటి వరకు ఎక్కడా గౌరవం దక్కలేదని వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అనాడు భార్యాపిల్లలను వదిలి, రాత్రింబవళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఫలాలు తమకు దక్కలేదని ఆయన కన్నీరు మున్నీరయ్యారు.