
మహబూబ్ నగర్: ఎస్పీ హెచ్చరిక.. పోలీస్ యాక్ట్ అమలు
మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు నవంబర్ నెల మొత్తం పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని ఎస్పీ డి. జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు నిర్వహించరాదని ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులకు ఆమె సూచించారు. భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.




































