నారాయణపేట జిల్లా, మక్తల్ మండలం గొలపల్లి గ్రామంలో గురువారం మొదటిసారి నూతన రథోత్సవం సందర్భంగా హోమ కార్యక్రమం నిర్వహించారు. పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఐదుగురు దంపతులు అగ్నిగుండం ముందు ప్రత్యేక పూజలు చేశారు. తమ గ్రామంలో మొదటిసారి రథోత్సవం జరుగుతున్నందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.