జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అర్హులైన నిరుపేదలకు లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశించారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్ లో ఉట్కూరు, మక్తల్, మాగనూరు, కృష్ణా, నర్వ మండలాల్లోని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధిహామీ పథకం, ఆస్తి పన్ను వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.