నారాయణపేట జిల్లాలో ఉద్యోగులకు పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. DCRBలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీదేవికి హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి లభించింది. మంగళవారం ఎస్పీ ఆమెకు బ్యాడ్జ్ అలంకరించి, విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, ఎస్ఐ సునీత పాల్గొన్నారు.