గాంధీ ఆస్పత్రి అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆవరణలోని పెషీ కేఫ్ను సీజ్ చేశారు. కాంట్రాక్టు గడువు 2018లో ముగిసినా, యాజమాన్యం కోర్టును ఆశ్రయించి కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టు హెచ్డీఎస్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో కేఫ్లో అపరిశుభ్ర పరిస్థితులు, నాణ్యత లేని పదార్థాల తయారీపై ఆరోపణలు వచ్చాయి.