అశోకుడు రాసిన 9 పుస్తకాల గురించి ప్రపంచానికి చెప్పాలనే సంకల్పంతో 'మిరాయ్'ను దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని రూపొందించారని నటుడు మంచు మనోజ్ తెలిపారు. "ఈచిత్రంలో అవకాశం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తా. ఎందుకంటే నా జీవితంలో ఇలాంటి పాత్ర చేయలేదు,” అని 'మిరాయ్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మనోజ్ చెప్పారు. ఈ సినిమాలో మనోజ్ కనిపించిన ప్రతిసారీ ఆడియన్స్కు గూస్బంప్స్ వస్తాయని నటుడు తేజ సజ్జా అన్నారు.