AP: కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామానికి చెందిన అవంతి టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య పాల్పడింది. బాలిక మృతిపై ఎమ్మెల్యే శ్యాంబాబు విచారం వ్యక్తం చేస్తూ, ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పరీక్షల్లో ఓటమిపై
విద్యార్థులు కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, మళ్లీ విజయం సాధించవచ్చని ఆయన సూచించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.