తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా, పాలయంకోట్టై ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాఠశాల తరగతి గదిలో విద్యార్థినులు గుంపుగా కూర్చుని, ఏమాత్రం భయం లేకుండా మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో వారు 'చీర్స్' చెప్పుకుంటూ, నవ్వుతూ మద్యం తాగుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు, పాఠశాల యాజమాన్యం విచారణ చేపట్టారు. విచారణ అనంతరం సదరు విద్యార్థినులను సస్పెండ్ చేసింది.