
చిరుతతో ఆవు పోరాటం.. వీడియో వైరల్
రాజస్థాన్లోని ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్లో, కొలిపుర ప్రాంతంలో మేతకు వచ్చిన ఆవుపై చిరుత దాడి చేసింది. ఆవు తీవ్రంగా ప్రతిఘటించడంతో, చిరుత తోకముడిచి పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సమీపంలోని రహదారిపై వెళ్తున్న వాహనాల్లోని కొందరు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు.




