బంగారం, వెండి ధరలు సోమవారం అత్యంత భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.3,010 పెరిగి రూ.1,58,660కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.3,290 పెరిగి రూ.1,73,090 పలుకుతోంది. కేజీ వెండిపై రూ.10,100 పెరగడంతో రూ.3,25,100 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.