పొద్దున తగ్గి.. ఇప్పుడు మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఒకే రోజులో రెండుసార్లు బంగారం ధరల్లో మార్పులు జరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఉదయం 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,910 తగ్గగా.. సాయంత్రానికి రూ.990 పెరిగింది. దీంతో రూ.1,21,480కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర సాయంత్రానికి రూ.900 ఎగబాకి రూ.1,11,350 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.
