తెలంగాణలో ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెండింగ్ బకాయిలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకోసం రూ.1,000 కోట్లను రిలీజ్ చేసింది. ఈ నిధులను వారి ఖాతాల్లో జమ చేయనుంది. దాదాపు రూ.14,200 కోట్ల బకాయిలు ఉండగా గతేడాది ఆగస్టు నుంచి ప్రతి నెలా రూ.700 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని రూ.1,000 కోట్లకు పెంచింది.