
బిహార్లో మరోసారి NDAదే విజయం: మోదీ
బిహార్లో మరోసారి ఎన్డీయే కూటమిదే విజయమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. నిన్న జరిగిన భారీ పోలింగ్ గెలుపు సంకేతాలను ఇస్తోందని పేర్కొన్నారు. ఔరంగాబాద్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. జేడీయూ అబద్ధాల ప్యాకేజీని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని అన్నారు. 'జంగిల్ రాజ్'ను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ రానివ్వద్దనే దృఢ సంకల్పంతో ప్రజలు ఉన్నారని అన్నారు.




