గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ లాగా గవర్నర్ ప్రసంగం: KTR

7375చూసినవారు
గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ లాగా గవర్నర్ ప్రసంగం: KTR
TG: గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ లాగా గవర్నర్ ప్రసంగం ఉందని విమర్శించారు. కమీషన్లు తప్పా ప్రగతి లేదన్నారు. రుణమాఫీపై గవర్నర్ తో పచ్చి అబద్ధాలు చెప్పించారని అన్నారు. 420 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు.

సంబంధిత పోస్ట్