ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక మహిళ క్షుద్రపూజలతో వేధింపులకు పాల్పడిన వ్యక్తిని కొరడాతో చితక్కొట్టింది. క్షుద్రపూజల పేరుతో మౌల్వీ ఆ యువతిని వేధించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.