ఆసియా కప్ 2025లో గాయపడిన హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి 4 వారాలు పట్టే అవకాశం ఉంది. దీంతో అక్టోబర్ 29 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్కు అతను దూరంగా ఉండనున్నాడు. అయితే టీ20 సిరీస్లో ఆడే అవకాశం ఉంది. ఈ వన్డే సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పునరాగమనం చేయనున్నారు. అంతకంటేముందు భారత్ వెస్టిండీస్తో రెండు టెస్టులు ఆడనుంది.