సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ డీజీపీ బి.శివధర్రెడ్డి సూచించారు. మంగళవారం బంజారాహిల్స్లో ‘ఫ్రాడ్ కా ఫుల్స్టాప్’ అవగాహన కార్యక్రమానికి హాజరైన ఆయన, ఓ యువతి సైబర్ మోసానికి గురైన తీరును వివరించారు. సామాజిక మాధ్యమంలో పరిచయమైన యువకుడు, పెళ్లంటూ దగ్గరై ఆమె పేరుతో లోన్యాప్ల ద్వారా రూ.40 లక్షలు తీసుకొని ఖర్చు చేశాడని, దీనివల్ల ఆ యువతి 30 ఏళ్లకే అధిక రక్తపోటు, మధుమేహం బారిన పడిందని తెలిపారు.