ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో సోమవారం పాక్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 30 మందికి పైగా చనిపోగా.. అందులో చిన్నారులూ ఉన్నారు. దాడిలో మరణించిన ఓ చిన్నారిని చేతుల్లో ఎత్తుకొని తండ్రి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఏ తప్పు చేశారని ఇలా చంపేశారని పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ను ఆ తండ్రి నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.