ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో ఇటీవల తీవ్ర ప్రతికూల వాతావరణం ఏర్పడింది. భారీ వడగళ్ల వాన, పిడుగులు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. 24 గంటల్లో ఏకంగా 5 లక్షల మెరుపులు నమోదయ్యాయని సమాచారం. 9 సెంటీమీటర్ల పరిమాణంలో వడగళ్లు పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఇదే వేదికగా ఇవాళ (గురువారం)
భారత్–
ఆస్ట్రేలియా నాలుగో
టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభం కానుంది.