TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక హైదరాబాద్, మేడ్చల్, భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడొచ్చని తెలిపింది.