TG: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో ఆదివారం రాత్రి నుంచి మధాపూర్, ఆమీర్పేట్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.