హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎల్లారెడ్డిగూడ, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మియాపూర్తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.