
బస్సు ప్రమాద మృతుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం
AP: కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన రమేశ్ కుటుంబం అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న బంధువుల కారు జలదంకి వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరొకరరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.




