TG: హైకోర్టు ఈ నెల 7 నుంచి జూన్ 5 వరకు వేసవి సెలవులు ప్రకటించింది. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్లు ఏర్పాటు చేశారు. మే 14, 21, 28, జూన్ 4 తేదీల్లో పనిచేసే ఈ బెంచ్లలో హెబియస్ కార్పస్, ముందస్తు బెయిలు, బెయిలు దరఖాస్తులు, కూల్చివేతలు వంటి అత్యవసర కేసులను జస్టిస్ టీ మాధవీదేవి, జస్టిస్ జీఎం మొహియుద్దీన్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ నగేశ్ భీమపాక, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ సుద్దాల చలపతిరావు విచారిస్తారు.