రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ సిట్ తాజాగా 790 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో మృతుడి భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా సహా ఐదుగురు నిందితులపై పోలీసులు అభియోగాలు మోపారు.
ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో మరిన్ని ఫోరెన్సిక్ రిపోర్టులు అందిన తర్వాత మరో ముగ్గురు సహ నిందితులపై అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు సిట్ బృందం వెల్లడించింది.