AP: పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో జరిగిన భారీ పందెంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేష్ కోళ్ల మధ్య జరిగిన పోటీలో రాజమండ్రి రమేష్ గెలిచి రూ.1.53 కోట్లు సొంతం చేసుకున్నాడు. జిల్లాలో ఈ ఏడాది ఇదే అతిపెద్ద కోడిపందెంగా స్థానికులు చెబుతున్నారు. ముహూర్తాలు, జాతకాలు చూసుకుని పందెం రాయుళ్లు కోళ్లను బరిలో దించడమే ప్రత్యేకతగా మారింది.