
వాట్సాప్కు పోటీగా అరత్తాయ్
అమెరికా టెక్ దిగ్గజాలకు సవాలుగా నిలుస్తూ.. ఇండియాలో 'అరత్తాయ్' (Arattai) అనే స్వదేశీ యాప్ వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. చెన్నైకి చెందిన జోహో (Zoho) సంస్థ 2021లో ప్రారంభించిన ఈ యాప్, ప్రస్తుతం వాట్సాప్కు గట్టి పోటీనిస్తోంది. రోజుకు లక్షల్లో సైన్-అప్లు, ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రైవసీకి ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో ఇది ట్రెండింగ్లోకి వచ్చింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్థానిక డిజిటల్ సొల్యూషన్స్ వాడాలని పిలుపునిచ్చిన తర్వాత దీనికి మరింత ఆదరణ పెరిగింది. అయితే, వాట్సాప్లోని 50 కోట్ల మంది వినియోగదారులను, దాని ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ వంటి ఫీచర్లను అధిగమించి అరత్తాయ్ ఎంతవరకు నిలుస్తుందో చూడాలి.




