హిందూస్థాన్ యూనిలీవర్(HUL) సంస్థ సామాన్యులకు షాక్ ఇచ్చింది. సబ్బులు, షాంపూలు, వాషింగ్ పౌడర్లు, టీ, కాఫీ పౌడర్లు వంటి నిత్యావసరాల ధరలు 2-5% పెంచేసింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడి సరకులు, ప్యాకింగ్ ఖర్చులు 8-10% భారమవడంతో పెంచినట్లు పేర్కొంది. ఇక ఇప్పటికే గ్యాస్, ఆయిల్, కూరగాయల ధరలు పెరగడంతో అల్లాడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఇది మరింత భారం కానుంది.