ఢిల్లీలో దారుణ హత్య చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భర్త రూపక్ తన భార్య సోనియాను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త రూపక్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.