తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తూత్తుకుడి జిల్లాలో భార్య తనను విడిచి వెళ్లిపోయిందన్న కోపంతో, ఆమె సోదరులైన మందిరం (40) మరియు మురుగన్ (50)లను భర్త గోము హత్య చేశాడు. తన భార్యను వారిద్దరూ దాచిపెట్టారని భావించిన గోము, మంగళవారం రాత్రి మద్యం దుకాణం వద్ద వారితో గొడవపడి, కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సోదరులిద్దరూ ఆసుపత్రిలో బుధవారం రాత్రి మృతి చెందారు.