తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను దోచుకున్న
బీఆర్ఎస్ నేతలను సమాజం సామాజికంగా బహిష్కరించిందని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి రాజకీయ పదవులు దక్కవని, బీఆర్ఎస్కు గతం మాత్రమే మిగిలిందని, భవిష్యత్తులో ఎలాంటి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు.