భారీ వరద కారణంగా ఎంజీబీఎస్ (మహాత్మా గాంధీ బస్ స్టేషన్) కు బస్సులు నిలిచిపోయాయి. దీంతో శ్రీశైలం, అచ్చంపేట, కల్వకుర్తి వెళ్ళే బస్సులు సంతోష్ నగర్ (ఐఎస్ సదన్) నుంచి నడుస్తాయని అధికారులు శనివారం తెలిపారు. ప్రయాణికులు సంతోష్ నగర్, మిథాని, చాంద్రాయణగుట్ట వద్ద బస్సులను ఎక్కాలని సూచించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.