హయత్నగర్లోని ఓ HP పెట్రోల్ బంక్లో కారు ట్యాంక్ సామర్థ్యాన్ని మించి పెట్రోల్ నింపినట్లు బిల్లు ఇవ్వడం కలకలం రేపింది. కారు ట్యాంక్ సామర్థ్యం 27 లీటర్లే అయినప్పటికీ, 32 లీటర్లు పోసినట్లు రశీదు ఇవ్వడంతో కస్టమర్ ఆందోళనకు దిగాడు. బంక్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మీటర్లలో అవకతవకలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.