చాంద్రాయణగుట్ట - Chandrayangutta

విశ్వహిందూ పరిషత్ లో పగుడాకుల బాలస్వామికి కీలక బాధ్యతలు

విశ్వహిందూ పరిషత్ లో పగుడాకుల బాలస్వామికి కీలక బాధ్యతలు

విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ గా పగుడాకుల బాలస్వామి నియమితులయ్యారు. స్వామీజీల సమన్వయం, ధర్మ రక్షణ కోసం కృషి చేస్తానని బాలస్వామి తెలిపారు. మఠాలు, పీఠాలు, దేవాలయాల కేంద్రంగా హిందుత్వం ముందుకు సాగేలా పనిచేస్తామని, కులాల మధ్య అంతరాలను తొలగించి హిందూ సమాజాన్ని ఏకం చేస్తామని ఆయన పేర్కొన్నారు. మతం మారిన వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకువస్తామని, దేవాలయాలు, సాధుసంతులపై దాడులను అరికట్టేందుకు పోరాడతామని బాలస్వామి అన్నారు. హిందుత్వం బలపడితేనే భారతదేశం నిలబడుతుందని, ప్రతి హిందువు సంఘటితం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. బౌద్ధ, జైన, సిక్కు ధర్మాల వారినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు.

వీడియోలు


హైదరాబాద్
ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు: మోదీ
Jan 18, 2026, 10:01 IST/

ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు: మోదీ

Jan 18, 2026, 10:01 IST
కాంగ్రెస్ పార్టీ ప్రతికూల రాజకీయాలను దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీకి మద్దతు పెరుగుతోందన్నారు. బీహార్, తిరువనంతపురం, ముంబయి ఎన్నికల ఫలితాలు సుపరిపాలన, అభివృద్ధికి ప్రజల ప్రాధాన్యతను స్పష్టం చేశాయని చెప్పారు. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అజెండా లేకపోవడం, భారత వ్యతిరేక శక్తులతో జట్టు కట్టడం, చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించడం వంటి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పెంచి పోషించిన అక్రమ వలసదారులు ప్రజల భూములు ఆక్రమించుకుని, వారి సంస్కృతిపై దాడి చేస్తున్నారని, దీనివల్ల అస్సాం ప్రజల అస్తిత్వం ప్రమాదంలో పడిందని ఆరోపించారు.