జీహెచ్ఎంసీ విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి తొలి అడుగు పడింది. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ముసాయిదాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సోమవారం సాయంత్రం గవర్నర్ ఆమోదం అనంతరం ముసాయిదా పత్రాలు ప్రభుత్వానికి చేరాయి. దీని ఆధారంగా ప్రభుత్వం త్వరలోనే గెజిట్ను విడుదల చేయనుంది. ఈ చర్యతో హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించనుంది.