శంషాబాద్ బస్స్టాండ్ సమీపంలోని ఎన్హెచ్-44పై మ్యాన్హోల్ బ్లాక్ అవ్వడంతో రహదారిపైకి నీరు పొంగిపొర్లింది. ఈ ఘటనపై శంషాబాద్ ఏసీపీ పి. నాగభూషణం శనివారం స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. డ్రైనేజీ బ్లాకేజీని తొలగించి, నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి డీఆర్ఎఫ్ బృందం క్లీనింగ్ ఆపరేషన్ చేపట్టింది. రహదారిపై నీరు నిల్వ ఉండకుండా, వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.