హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో, యూసుఫ్ గూడ డివిజన్లో ఇంటింటి ప్రచారం గురువారం జరిగింది. ఈ ప్రచారంలో కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డితో పాటు యూసుఫ్ గూడ డివిజన్ ప్రభారీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.